Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:53 AM

వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి

వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి

వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
January 22, 2026 03:21 PM 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తీన్మార్ మల్లన్న

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. యూనివర్సిటీ అధికారులు తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం పలికారు.అనంతరం యూనివర్సిటీ అధికారులు, సిబ్బందితో కలిసి తీన్మార్ మల్లన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యా రంగం, పరిశోధన కార్యకలాపాలు, మౌలిక వసతులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై అధికారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వివరించిన సమస్యలను శ్రద్ధగా విన్న తీన్మార్ మల్లన్న, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.రాష్ట్రంలో రైతు, వ్యవసాయం, వ్యవసాయ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల బలోపేతమే రైతుల అభివృద్ధికి పునాది అని తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News