వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
Biksham
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తీన్మార్ మల్లన్న
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. యూనివర్సిటీ అధికారులు తీన్మార్ మల్లన్నకు ఘన స్వాగతం పలికారు.అనంతరం యూనివర్సిటీ అధికారులు, సిబ్బందితో కలిసి తీన్మార్ మల్లన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యా రంగం, పరిశోధన కార్యకలాపాలు, మౌలిక వసతులు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై అధికారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వివరించిన సమస్యలను శ్రద్ధగా విన్న తీన్మార్ మల్లన్న, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.రాష్ట్రంలో రైతు, వ్యవసాయం, వ్యవసాయ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల బలోపేతమే రైతుల అభివృద్ధికి పునాది అని తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి