Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:05 PM

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు
March 12, 2026 12:02 PM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం ఉదయం చనుబండ పెద్ద చెరువు కట్ట వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రస్తావిస్తూ మనం చెట్లను కాపాడితే అవే మనలను కాపాడతాయని తెలిపారు. ప్రస్తుతం విచ్చలవిడిగా అడవులు, చెట్లు నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, చలితీవ్రత అధికమవడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మానవుల తక్షణ కర్తవ్యమని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కొండా తాతయ్యబాబు, పెద్ద చెరువు నీటిసంఘం ఉపాధ్యక్షులు గవర వెంకటేశ్వరరావు, బుస్సు తిరుపతయ్య, కళ్ళేపల్లి మారేశ్వరరావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News