చాట్రాయి: వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం ఉదయం చనుబండ పెద్ద చెరువు కట్ట వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రస్తావిస్తూ మనం చెట్లను కాపాడితే అవే మనలను కాపాడతాయని తెలిపారు. ప్రస్తుతం విచ్చలవిడిగా అడవులు, చెట్లు నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, చలితీవ్రత అధికమవడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మానవుల తక్షణ కర్తవ్యమని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కొండా తాతయ్యబాబు, పెద్ద చెరువు నీటిసంఘం ఉపాధ్యక్షులు గవర వెంకటేశ్వరరావు, బుస్సు తిరుపతయ్య, కళ్ళేపల్లి మారేశ్వరరావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి