Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:42 AM

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు
12-03-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం ఉదయం చనుబండ పెద్ద చెరువు కట్ట వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రస్తావిస్తూ మనం చెట్లను కాపాడితే అవే మనలను కాపాడతాయని తెలిపారు. ప్రస్తుతం విచ్చలవిడిగా అడవులు, చెట్లు నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, చలితీవ్రత అధికమవడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మానవుల తక్షణ కర్తవ్యమని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కొండా తాతయ్యబాబు, పెద్ద చెరువు నీటిసంఘం ఉపాధ్యక్షులు గవర వెంకటేశ్వరరావు, బుస్సు తిరుపతయ్య, కళ్ళేపల్లి మారేశ్వరరావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

వాతావరణ సమతుల్యానికి చెట్ల పెంపకం అవసరం చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు

Article Image

చాట్రాయి: వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకం అత్యంత అవసరమని చనుబండ పీఏసీఎస్ ఛైర్మన్ మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గురువారం ఉదయం చనుబండ పెద్ద చెరువు కట్ట వద్ద నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రస్తావిస్తూ మనం చెట్లను కాపాడితే అవే మనలను కాపాడతాయని తెలిపారు. ప్రస్తుతం విచ్చలవిడిగా అడవులు, చెట్లు నరికివేయడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. దీని ఫలితంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, చలితీవ్రత అధికమవడం వంటి అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మానవుల తక్షణ కర్తవ్యమని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ఫీల్డ్ అసిస్టెంట్ కొండా తాతయ్యబాబు, పెద్ద చెరువు నీటిసంఘం ఉపాధ్యక్షులు గవర వెంకటేశ్వరరావు, బుస్సు తిరుపతయ్య, కళ్ళేపల్లి మారేశ్వరరావు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News