వట్ పల్లి గ్రామంలో భద్రతా చర్యలపై సర్పంచ్ ఆధ్వర్యంలో సమీక్ష
వట్ పల్లి గ్రామంలో భద్రతా చర్యలపై సర్పంచ్ ఆధ్వర్యంలో సమీక్ష
Sthanikam District Staff Reporter krishna
ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :వట్ పల్లి గ్రామంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీసీ కెమెరాల ఏర్పాటు అంశంపై గ్రామ నాయకులు సమీక్ష నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుద్దిరెడ్డి, మాజీ ఎంపీటీసీ లొంకల శివాజీ రావు పాల్గొని గ్రామంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు.గ్రామంలో జనసంచారం అధికంగా ఉండే ప్రధాన కూడళ్లు, పాఠశాలల పరిసరాలు,ఆలయాలు, బస్టాప్ ప్రాంతాలు,వ్యాపార కేంద్రాలు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నాయకులు సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు అనుమానాస్పద ఘటనలపై నిఘా ఉంచడం సాధ్యమవుతుందని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ లావ్ కుమార్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల పోలీస్ శాఖకు సహకారం పెరుగుతుందని, గ్రామంలో చట్టసువ్యవస్థలు మరింత పటిష్టంగా మారతాయని పేర్కొన్నారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు.గ్రామాభివృద్ధితో పాటు ప్రజల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గ్రామ సర్పంచ్ రవీందర్ తెలిపారు. గ్రామాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి