వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.
వాసవి యూత్ క్లబ్ కోదాడ చలివేంద్రం ఏర్పాటు.
Harish HS
వాసవి యూత్ క్లబ్ కోదాడ ఆధ్వర్యంలో ఓరుగంటి కృష్ణమూర్తి వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఓరుగంటి మణిదీప్, కే వై ఎఫ్ ఇమ్మడి అనంత చక్రవర్తి, బి వి అసోసియేట్స్ నాగరాజు అఖిల్ ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు క్లబ్ సభ్యులు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కోదాడ ప్రాంతంలో అతి రద్దీ ప్రాంతమైన హుజూర్నగర్ రోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా సాయి శ్రీ హాస్పిటల్ నందు వాసవి యూత్ క్లబ్ కోదాడ సభ్యులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలో అనేక స్థలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల్ సాయి, గురుమూర్తి, నాగరాజు, సతీష్, శ్రీనివాసరావు, లోకేష్, చక్రి బుజ్జయ్య, పుల్లయ్య, ప్రసాదు లక్ష్మీనరసయ్య, మహిళా సభ్యులు పబ్బ గీతా, మంజుల సువర్ణ తదితరులు పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి