Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 02:05 AM

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు
January 22, 2026 09:54 AM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

ఖాతాదారులకు స్వల్ప అసౌకర్యం… ఏటీఎం, ఆన్‌లైన్ సేవలకు ఇబ్బంది లేదు

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు అందుబాటులో ఉండవు. జనవరి 24వ తేదీ నాలుగో శనివారం, 25వ తేదీ ఆదివారం, 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండగా, 27వ తేదీన సమ్మె కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 27న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేయవని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి.అయితే ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఏటీఎంలు, ఆన్‌లైన్ లావాదేవీలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. నగదు అవసరాలు ఉన్న వారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో చెక్కుల క్లియరెన్స్, కౌంటర్ సేవలు, కొత్త ఖాతాల ప్రారంభం వంటి లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల అత్యవసర బ్యాంకు పనులను ఖాతాదారులు ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News