వరుస ద్విచక్ర వాహన దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు
వరుస ద్విచక్ర వాహన దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు
Krishna
సదాశివపేట పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని సదాశివపేట పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పట్టణ పోలీసు ఇన్స్పెక్టర్ డి. వెంకటేష్ మీడియాకు తెలిపారు. ఇష్రీతాబాద్ గ్రామానికి చెందిన బలరాం సంగమేశ్వర్ అనే వ్యక్తి మద్యం మరియు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే నెలలో ఇష్రీతాబాద్ గ్రామంలో పల్సర్ వాహనం, ఆత్మకూరు గ్రామంలో గ్లామర్ వాహనం, సదాశివపేట పట్టణంలో స్ప్లెండర్ ప్లస్ వాహనాన్ని దొంగతనం చేసినట్లు విచారణలో బయటపడింది. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలను ఒప్పుకున్నాడు. అనంతరం మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఐడి పార్టీ కానిస్టేబుళ్లు వెంకటేశం, అమానుల్లా, నహీద్ పాషా, మల్లేశంలను ఇన్స్పెక్టర్ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి