Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:59 AM

వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం సకాలంలో సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక

వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం సకాలంలో సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక

వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం సకాలంలో సస్యరక్షణ చేపట్టాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక
February 23, 2026 04:43 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వరిలో అగ్గి, పాము పొడ తెగుళ్లు తీవ్రం

సకాలంలో సస్యరక్షణ చేపట్టాలి

విస్సన్నపేట :

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సబ్‌డివిజన్ పరిధిలో వరిలో అగ్గి తెగులు, పాము పొడ తెగులు, జింకు లోపం లక్షణాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సహాయ వ్యవసాయ సంచాలకులు కె. శశికళ, మండల వ్యవసాయ అధికారి షేక్ టిప్పు సుల్తాన్ మాట్లాడుతూ, జింకు లోపం నివారణకు ఎకరానికి ఒక కిలో జింక్ సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు.

పాము పొడ తెగులు ఉన్న పంటల్లో ఎంట్రకాల్ ఎం-45 (800 గ్రాములు) లేదా కాంటాఫ్ (200 మి.లీ.) లేదా టిల్ట్ (200 మి.లీ.) మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

అగ్గి తెగులు నియంత్రణకు బీమ్ (120 గ్రాములు) లేదా మెర్జర్ (500 గ్రాములు) మందులను వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు. ఒకేసారి అగ్గి, పాము పొడ తెగుళ్లు ఉన్నట్లయితే కస్టోడియ (40 గ్రాములు) లేదా నాటివో (80 గ్రాములు) మందులను 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో మార్చి మార్చి పిచికారి చేయాలని చెప్పారు.

అధిక మోతాదులో నత్రజని ఎరువులు వేయడం వల్ల తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశముందని, సిఫార్సు చేసిన మోతాదులోనే ఎరువులు వాడాలని హెచ్చరించారు. అగ్గి తెగులు సకాలంలో నియంత్రించకపోతే మెడవిరుపు దశకు చేరి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందన్నారు.

రైతులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News