Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

వరికొయ్యలు తగలబెట్టొద్దు. రైతులకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

వరికొయ్యలు తగలబెట్టొద్దు. రైతులకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

వరికొయ్యలు తగలబెట్టొద్దు. రైతులకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్
29-05-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మండలంలోని రైతులు తమ పంటచేలలో ఉన్న వరికొయ్యలను తగలబెట్టవద్దని ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు. ప్రస్తుతం మండుతున్న ఎండలు, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు త్వరగా వ్యాపించి భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.

వరికొయ్యలను తగలబెట్టడం వల్ల గడ్డివాములు, కరెంట్ వైర్లు, పైపులైన్లు దగ్ధమయ్యే ప్రమాదంతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రైతులతో పాటు ఇతరులకు కూడా తీవ్ర ఆర్థిక నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు.

మంటలు ఆరిపోయినట్లు కనిపించినా గాలుల ప్రభావంతో మళ్లీ రగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండి తమతో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

వరికొయ్యలు తగలబెట్టొద్దు. రైతులకు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

Article Image

మండలంలోని రైతులు తమ పంటచేలలో ఉన్న వరికొయ్యలను తగలబెట్టవద్దని ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు. ప్రస్తుతం మండుతున్న ఎండలు, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు త్వరగా వ్యాపించి భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.

వరికొయ్యలను తగలబెట్టడం వల్ల గడ్డివాములు, కరెంట్ వైర్లు, పైపులైన్లు దగ్ధమయ్యే ప్రమాదంతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రైతులతో పాటు ఇతరులకు కూడా తీవ్ర ఆర్థిక నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు.

మంటలు ఆరిపోయినట్లు కనిపించినా గాలుల ప్రభావంతో మళ్లీ రగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండి తమతో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News