మండలంలోని రైతులు తమ పంటచేలలో ఉన్న వరికొయ్యలను తగలబెట్టవద్దని ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ సూచించారు. ప్రస్తుతం మండుతున్న ఎండలు, వేగంగా వీస్తున్న గాలుల కారణంగా మంటలు త్వరగా వ్యాపించి భారీ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.
వరికొయ్యలను తగలబెట్టడం వల్ల గడ్డివాములు, కరెంట్ వైర్లు, పైపులైన్లు దగ్ధమయ్యే ప్రమాదంతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రైతులతో పాటు ఇతరులకు కూడా తీవ్ర ఆర్థిక నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు.
మంటలు ఆరిపోయినట్లు కనిపించినా గాలుల ప్రభావంతో మళ్లీ రగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండి తమతో పాటు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి