Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:42 AM

వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు

వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు

వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు
May 25, 2026 11:57 AM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతులకు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరిక.



నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని రైతులు ఎవరూ కూడా వరి కోయలను తగలబెట్టవద్దని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరించారు. ఇటీవల వరి కోయలు తగలబెట్టడం వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. పొలాల్లో మంటలు వేయడం ద్వారా సమీపంలోని పంటలు, విద్యుత్ తీగలు, చెట్లు దగ్ధమవుతున్నాయని పేర్కొన్నారు.వరి కోయలు తగలబెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కోయలను ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వరి కోయలు తగలబెట్టినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News