Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:07 AM

వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు

వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు

వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు
25-05-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతులకు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరిక.



నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని రైతులు ఎవరూ కూడా వరి కోయలను తగలబెట్టవద్దని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరించారు. ఇటీవల వరి కోయలు తగలబెట్టడం వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. పొలాల్లో మంటలు వేయడం ద్వారా సమీపంలోని పంటలు, విద్యుత్ తీగలు, చెట్లు దగ్ధమవుతున్నాయని పేర్కొన్నారు.వరి కోయలు తగలబెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కోయలను ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వరి కోయలు తగలబెట్టినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.

Sthanikam

వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు

Article Image

రైతులకు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరిక.



నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని రైతులు ఎవరూ కూడా వరి కోయలను తగలబెట్టవద్దని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరించారు. ఇటీవల వరి కోయలు తగలబెట్టడం వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. పొలాల్లో మంటలు వేయడం ద్వారా సమీపంలోని పంటలు, విద్యుత్ తీగలు, చెట్లు దగ్ధమవుతున్నాయని పేర్కొన్నారు.వరి కోయలు తగలబెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కోయలను ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వరి కోయలు తగలబెట్టినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News