PRINT TIME: May 26, 2026 12:56 PM
వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు
వరి కోయలు తగలబెడితే కఠిన చర్యలు
May 25, 2026 11:57 AM
90 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
రైతులకు చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరిక.
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని రైతులు ఎవరూ కూడా వరి కోయలను తగలబెట్టవద్దని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ హెచ్చరించారు. ఇటీవల వరి కోయలు తగలబెట్టడం వల్ల పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. పొలాల్లో మంటలు వేయడం ద్వారా సమీపంలోని పంటలు, విద్యుత్ తీగలు, చెట్లు దగ్ధమవుతున్నాయని పేర్కొన్నారు.వరి కోయలు తగలబెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి కోయలను ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వరి కోయలు తగలబెట్టినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి