వార్డులలో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ నాయకులు
వార్డులలో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ నాయకులు
Krishna
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 5, 6, 10, 12 వార్డులలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా
5వ వార్డులో అభ్యర్థిగా శేఖర్,
6వ వార్డులో అభ్యర్థిగా సతీష్ కుమార్,
10వ వార్డులో అభ్యర్థిగా సనా సుల్తానా సయ్యద్ ఆసిఫ్,
12వ వార్డులో అభ్యర్థిగా పరశురాం
కారు గుర్తుతో ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు.ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ప్రతి గల్లీకి సిసి రోడ్లు వేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించి, నల్ల కలెక్షన్ల ద్వారా శుద్ధమైన నీటిని అందించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు.పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, అప్పుడు మాత్రమే నారాయణఖేడ్ మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి