వార్డు సభ్యులకు శిక్షణ ముగింపు – సర్టిఫికెట్ల పంపిణీ
వార్డు సభ్యులకు శిక్షణ ముగింపు – సర్టిఫికెట్ల పంపిణీ
K.RAVI
చౌటుప్పల్ మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు సభ్యులకు నిర్వహించిన రెండవ విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి ముఖ్య అతిథిగా హాజరై వార్డు సభ్యులకు పలు సూచనలు చేశారు.గ్రామాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వార్డు సభ్యులు చురుకుగా పనిచేయాలని ఆమె సూచించారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు.శిక్షణలో పాల్గొన్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. సందీప్ కుమార్, సూపరింటెండెంట్ బి. విజయకుమార్, పంచాయతీ కార్యదర్శులు, టి.ఓ.టి లు శ్రీకాంత్, శివశంకర్, వెంకటేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి