Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:13 AM

వార్డు సభ్యులకు శిక్షణ ముగింపు – సర్టిఫికెట్ల పంపిణీ

వార్డు సభ్యులకు శిక్షణ ముగింపు – సర్టిఫికెట్ల పంపిణీ

వార్డు సభ్యులకు శిక్షణ ముగింపు – సర్టిఫికెట్ల పంపిణీ
March 13, 2026 06:57 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన వార్డు సభ్యులకు నిర్వహించిన రెండవ విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి ముఖ్య అతిథిగా హాజరై వార్డు సభ్యులకు పలు సూచనలు చేశారు.గ్రామాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వార్డు సభ్యులు చురుకుగా పనిచేయాలని ఆమె సూచించారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి వాటికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు.శిక్షణలో పాల్గొన్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. సందీప్ కుమార్, సూపరింటెండెంట్ బి. విజయకుమార్, పంచాయతీ కార్యదర్శులు, టి.ఓ.టి లు శ్రీకాంత్, శివశంకర్, వెంకటేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News