ఎన్నికల హామీ అమలు… 10వ వార్డులో కౌన్సిలర్ మాట నిలబెట్టుకున్నారు!
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీని పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో 10వార్డు ప్రజలను ఉద్దేశించి, “తనను గెలిపిస్తే వార్డు పరిధిలోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,016లను కానుకగా అందిస్తాను” అని ఇచ్చిన మాటను ఆచరణలో చూపించారు.
అంబేద్కర్ నగర్కు చెందిన కీ.శే. సుంకరి నరసింహ–పద్మల ప్రథమ పుత్రిక రాజేశ్వరి వివాహ వేడుకలో కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్–కవిత దంపతులు పాల్గొన్నారు. యువశక్తి యువజన సంఘం సభ్యులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి రూ.10,016లను నగదు రూపంలో కానుకగా అందజేశారు.
ప్రజలకు ఇచ్చిన మాట పవిత్రం. అది నిలబెట్టుకోవడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత” అని శ్రీనివాస్ పేర్కొన్నారు.వార్డు ప్రజలు కౌన్సిలర్ చర్యను అభినందిస్తూ, ఎన్నికల హామీలను అమలు చేయడం మంచి ప్రారంభమని అభిప్రాయపడ్డారు. యువశక్తి సభ్యులు కూడా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రజలకు తోడుగా నిలుస్తామని తెలిపారు.
ప్రజా హామీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన చిట్యాలలో చర్చనీయాంశమైంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి