Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:40 PM

వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్

వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్

వార్డు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్
February 20, 2026 06:47 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఎన్నికల హామీ అమలు… 10వ వార్డులో కౌన్సిలర్ మాట నిలబెట్టుకున్నారు!

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీని పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో 10వార్డు ప్రజలను ఉద్దేశించి, “తనను గెలిపిస్తే వార్డు పరిధిలోని ప్రతి ఇంటి ఆడబిడ్డ వివాహానికి రూ.10,016లను కానుకగా అందిస్తాను” అని ఇచ్చిన మాటను ఆచరణలో చూపించారు.

అంబేద్కర్ నగర్‌కు చెందిన కీ.శే. సుంకరి నరసింహ–పద్మల ప్రథమ పుత్రిక రాజేశ్వరి వివాహ వేడుకలో కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్–కవిత దంపతులు పాల్గొన్నారు. యువశక్తి యువజన సంఘం సభ్యులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి రూ.10,016లను నగదు రూపంలో కానుకగా అందజేశారు.

ప్రజలకు ఇచ్చిన మాట పవిత్రం. అది నిలబెట్టుకోవడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత” అని శ్రీనివాస్ పేర్కొన్నారు.వార్డు ప్రజలు కౌన్సిలర్ చర్యను అభినందిస్తూ, ఎన్నికల హామీలను అమలు చేయడం మంచి ప్రారంభమని అభిప్రాయపడ్డారు. యువశక్తి సభ్యులు కూడా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రజలకు తోడుగా నిలుస్తామని తెలిపారు.

ప్రజా హామీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన చిట్యాలలో చర్చనీయాంశమైంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News