Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:54 PM

వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి

వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి

వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి
February 05, 2026 06:41 PM 329 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్

వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులో బాధ్యతయుతమైన పాలనఅందిస్తానని. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలతో పాటు మున్సిపాలిటీలు పట్టుకొమ్మలని, అలాంటి మున్సిపాలిటీలో ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకుంటారు. ఆలోచనతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధి కి వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా నన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవకొరకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు నాపై విశ్వాసంతో నన్ను ఆశీర్వదిస్తే పట్టణంలోని అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని, కుల మత జాతి విభేదాలు లేకుండా పనిచేస్తానని, అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవంతో సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చానని అన్నారు. వార్డు ప్రజలు పెద్ద మనసు చేసుకొని కౌన్సిలర్ గా గెలిపిస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయిస్తానని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిస్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ఓటర్లను కోరారు. అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News