Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:11 AM

వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి

వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి

వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి
05-02-2026 346 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్

వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులో బాధ్యతయుతమైన పాలనఅందిస్తానని. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలతో పాటు మున్సిపాలిటీలు పట్టుకొమ్మలని, అలాంటి మున్సిపాలిటీలో ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకుంటారు. ఆలోచనతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధి కి వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా నన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవకొరకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు నాపై విశ్వాసంతో నన్ను ఆశీర్వదిస్తే పట్టణంలోని అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని, కుల మత జాతి విభేదాలు లేకుండా పనిచేస్తానని, అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవంతో సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చానని అన్నారు. వార్డు ప్రజలు పెద్ద మనసు చేసుకొని కౌన్సిలర్ గా గెలిపిస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయిస్తానని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిస్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ఓటర్లను కోరారు. అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

వార్డు అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి

Article Image

13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్

వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డులో బాధ్యతయుతమైన పాలనఅందిస్తానని. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీలో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలతో పాటు మున్సిపాలిటీలు పట్టుకొమ్మలని, అలాంటి మున్సిపాలిటీలో ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకుంటారు. ఆలోచనతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. మున్సిపాలిటీలోని 13వ వార్డు అభివృద్ధి కి వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా నన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవకొరకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు నాపై విశ్వాసంతో నన్ను ఆశీర్వదిస్తే పట్టణంలోని అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలందిస్తానని, కుల మత జాతి విభేదాలు లేకుండా పనిచేస్తానని, అందరిని సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవంతో సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చానని అన్నారు. వార్డు ప్రజలు పెద్ద మనసు చేసుకొని కౌన్సిలర్ గా గెలిపిస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేయిస్తానని అన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిస్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధమైన సేవలను అందించడంలో ముందు ఉంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని ఓటర్లను కోరారు. అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News