Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:54 PM

విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్

విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్

విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్  ఈడెం రాధ శ్రీనివాస్
30-12-2025 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం

వెల్లంకి గ్రామంలో మానవీయతకు నిలువెత్తు ఉదాహరణ

రామన్నపేట, స్థానికం ప్రతినిధి:

మండల పరిధిలోని వెల్లంకి గ్రామానికి చెందిన కందాల అండాలు అనారోగ్యంతో మృతి చెందడం గ్రామాన్ని విషాదంలో ముంచింది. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్పందించి మానవీయత చాటుకున్నారు.

సోమవారం అండాలు మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సర్పంచ్, అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు అంత్యక్రియల నిమిత్తం రూ.5,000ల ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు.

ఈ సందర్భంగా “ఆపదలో ఉన్న కుటుంబాలకు గ్రామ పంచాయతీ అండగా నిలుస్తుంది” అని సర్పంచ్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా బాధను పంచుకోవడమే తన బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈడెం శ్రీనివాస్, వార్డు సభ్యులు జింక శాంతి, తలారి నరసింహ, జింక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చర్యను గ్రామస్తులు ప్రశంసిస్తూ మానవత్వానికి మచ్చుతునకగా కొనియాడారు.

Sthanikam

విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్

Article Image

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం

వెల్లంకి గ్రామంలో మానవీయతకు నిలువెత్తు ఉదాహరణ

రామన్నపేట, స్థానికం ప్రతినిధి:

మండల పరిధిలోని వెల్లంకి గ్రామానికి చెందిన కందాల అండాలు అనారోగ్యంతో మృతి చెందడం గ్రామాన్ని విషాదంలో ముంచింది. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్పందించి మానవీయత చాటుకున్నారు.

సోమవారం అండాలు మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సర్పంచ్, అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు అంత్యక్రియల నిమిత్తం రూ.5,000ల ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు.

ఈ సందర్భంగా “ఆపదలో ఉన్న కుటుంబాలకు గ్రామ పంచాయతీ అండగా నిలుస్తుంది” అని సర్పంచ్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా బాధను పంచుకోవడమే తన బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈడెం శ్రీనివాస్, వార్డు సభ్యులు జింక శాంతి, తలారి నరసింహ, జింక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చర్యను గ్రామస్తులు ప్రశంసిస్తూ మానవత్వానికి మచ్చుతునకగా కొనియాడారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News