విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్
విషాద వేళ మానవత్వం చాటిన సర్పంచ్ ఈడెం రాధ శ్రీనివాస్
స్థానికం బృందం
మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం
వెల్లంకి గ్రామంలో మానవీయతకు నిలువెత్తు ఉదాహరణ
రామన్నపేట, స్థానికం ప్రతినిధి:
మండల పరిధిలోని వెల్లంకి గ్రామానికి చెందిన కందాల అండాలు అనారోగ్యంతో మృతి చెందడం గ్రామాన్ని విషాదంలో ముంచింది. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ ఇడం రాధా శ్రీనివాస్ స్పందించి మానవీయత చాటుకున్నారు.
సోమవారం అండాలు మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సర్పంచ్, అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు అంత్యక్రియల నిమిత్తం రూ.5,000ల ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు.
ఈ సందర్భంగా “ఆపదలో ఉన్న కుటుంబాలకు గ్రామ పంచాయతీ అండగా నిలుస్తుంది” అని సర్పంచ్ తెలిపారు. ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా బాధను పంచుకోవడమే తన బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఈడెం శ్రీనివాస్, వార్డు సభ్యులు జింక శాంతి, తలారి నరసింహ, జింక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ చర్యను గ్రామస్తులు ప్రశంసిస్తూ మానవత్వానికి మచ్చుతునకగా కొనియాడారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి