వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్
వైసీపీ నీచ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి చాట్రాయి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి ఫిబ్రవరి 1 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) చాట్రాయిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో చాట్రాయి జనసేన మండల పార్టీ ఉపాధ్యక్షులు తుమ్మల జగన్
మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అత్యంత అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రజా జీవితంలో ఉండే అర్హత కోల్పోయారని, ముఖ్యమంత్రి గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన ఆ నేతపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, అతని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, వైసీపీ డి.ఎన్.ఎ.లోనే లోపం ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు కూడా దిగజారి, కనీస మర్యాద, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, అతని పార్టీ వ్యక్తులు అదే విధంగా దిగజారిపోతున్నారని, ఆ పార్టీ ప్రజాస్వామ్య విలువలని, రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించడం లేదని, రాజకీయాల్లో హుందాతనానికి తిలోదకాలు ఇచ్చి నీచమైన వ్యాఖ్యలకి, చర్యలకి పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల కరుణాకర్, చంద్రశేఖర్, మహేష్, తిరుపతిరావు, నెల్లూరు సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి