వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హర్యానా నెంబర్ కారులో 67 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం
వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హర్యానా నెంబర్ కారులో 67 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం
GADDAM JAGANMOHAN REDDY
ఖమ్మం జిల్లా : వైరాలో ఎక్సైజ్ అధికారుల అప్రమత్తతతో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషీష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం అనుమానాస్పదంగా ఉన్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఆపి తనిఖీ చేయగా ఈ మత్తు పదార్థాలు బయటపడ్డాయి. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసిన చెక్లో గంజాయి సంచులు, హాషీష్ ఆయిల్ ప్యాకెట్లు గుర్తించారు.
ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్కు చెందిన మహమ్మద్ అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వైరా ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల మొత్తం విలువ సుమారు రూ. 67.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
డ్రగ్స్ రవాణాపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి