Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:59 PM

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హర్యానా నెంబర్ కారులో 67 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం

వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హర్యానా నెంబర్ కారులో 67 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం

 వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హర్యానా నెంబర్ కారులో 67 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం
February 24, 2026 10:11 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఖమ్మం జిల్లా : వైరాలో ఎక్సైజ్ అధికారుల అప్రమత్తతతో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అనుమానాస్పదంగా ఉన్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఆపి తనిఖీ చేయగా ఈ మత్తు పదార్థాలు బయటపడ్డాయి. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసిన చెక్‌లో గంజాయి సంచులు, హాషీష్ ఆయిల్ ప్యాకెట్లు గుర్తించారు.

ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన మహమ్మద్ అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని వైరా ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల మొత్తం విలువ సుమారు రూ. 67.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

డ్రగ్స్ రవాణాపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News