Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:06 PM

వైఎస్సార్‌ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డే

వైఎస్సార్‌ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డే

వైఎస్సార్‌ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డే
May 12, 2026 05:32 PM 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుంజ రేణుక నారాయణ నియామకం చారిత్రాత్మకం: ఆలకుంట్ల రాజు

రామన్నపేట

వడ్డెరలకు వైఎస్సార్‌ తర్వాత న్యాయం చేసింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు ఆలకుంట్ల రాజు పేర్కొన్నారు. రాష్ట్ర వడ్డెర కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంజ రేణుక నారాయణను నియమించడం హర్షణీయమన్నారు.

మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వడ్డెరలకు కనీస న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు గుంజ రేణుక నారాయణ నియామకాన్ని వ్యతిరేకించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

వడ్డెరల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, రాజశేఖర్‌రెడ్డి తర్వాత వడ్డెరలకు కార్పొరేషన్‌ పదవి కల్పించింది కాంగ్రెస్‌ పార్టీయేనని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ మంజల్కర్‌కు ఆలకుంట్ల రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News