వైఎస్సార్ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్రెడ్డే
వైఎస్సార్ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్రెడ్డే
Editor Desk
గుంజ రేణుక నారాయణ నియామకం చారిత్రాత్మకం: ఆలకుంట్ల రాజు
రామన్నపేట
వడ్డెరలకు వైఎస్సార్ తర్వాత న్యాయం చేసింది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనని అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఆలకుంట్ల రాజు పేర్కొన్నారు. రాష్ట్ర వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్గా గుంజ రేణుక నారాయణను నియమించడం హర్షణీయమన్నారు.
మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డెరలకు కనీస న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు గుంజ రేణుక నారాయణ నియామకాన్ని వ్యతిరేకించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
వడ్డెరల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కట్టుబడి ఉన్నారని, రాజశేఖర్రెడ్డి తర్వాత వడ్డెరలకు కార్పొరేషన్ పదవి కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్, నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ మంజల్కర్కు ఆలకుంట్ల రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి