Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:29 AM

వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైనికులతో డా. బొత్సా అనూష ఆత్మీయ సమావేశం.

వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైనికులతో డా. బొత్సా అనూష ఆత్మీయ సమావేశం.

వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైనికులతో డా. బొత్సా అనూష ఆత్మీయ సమావేశం.
February 10, 2026 03:27 AM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

చీపురుపల్లి: వైఎస్ఆర్ సీపీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా సైనికులతో సోమవారం గరివిడి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ మాజీ మంత్రి వర్యులు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్సా సత్యనారాయణ గారు,జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) సూచనలు మేరకు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యువనాయకురాలు డా. బొత్సా అనూష గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వైఎస్ఆర్ సీపీని మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు,భవిష్యత్తు కార్యాచరణపై ఆమె దిశానిర్దేశం చేశారు.సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని,మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించ కుండా సంయమనం పాటించాలని సూచించారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లేలా సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలన్నారు. ప్రజలకు,రైతులకు, విద్యార్థులకు అధికార పార్టీ నాయకులు చేస్తున్న నష్టాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని డా. బొత్సా అనూష సూచించారు.ఈ సందర్భంగా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం ప్రెసిడెంట్ గా ఎల్. ప్రభాత్ కుమార్, చీపురుపల్లి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా యర్రా శ్యామ్ సుందర్ రావు, గుర్ల మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా మంత్రి పైడినాయుడు, గరివిడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా గవిడి పాపారావు,మెరకముడిదాం మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడుగా లోపింటి శంకరావులను నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గరివిడి ఎంపీపీ మీసాల విశ్వేశ్వర రావు వైఎస్ఆర్ సీపీ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు కెల్ల సురేష్, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ శాసపు ప్రకాష్, సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News