విద్యకు దిశ చూపిన సావిత్రిబాయి ఫూలేకు నాగార్జున స్కూల్ ఘన నివాళి
విద్యకు దిశ చూపిన సావిత్రిబాయి ఫూలేకు నాగార్జున స్కూల్ ఘన నివాళి
Editor Desk
నాగార్జున స్కూల్లో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
రామన్నపేట స్థానికం ప్రతినిధి
నాగార్జున స్కూల్లో సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, విద్యార్థులు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయుల పాత్రలు పోషిస్తూ వివిధ సబ్జెక్టులు బోధించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రిన్సిపాల్ రేఖ.ఎన్ సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, సామాజిక సంస్కర్తగా సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి బాలికల కోసం తొలి పాఠశాల స్థాపించి మహిళల విద్యకు దారితీసిన గొప్ప వ్యక్తిత్వమని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నది ఆమె ఆశయమని తెలిపారు. సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ నాగరాజు.ఎన్ విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు అక్రమ్, సంధ్య, స్వప్న, విజయశ్రీలత, వినిషతో పాటు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి