ప్రెసిడెన్సి గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్ పర్సన్ తీగల జయలక్ష్మి
స్థానికం: భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్
నర్సరీ నుంచి హైస్కూల్ వరకు విద్యార్థుల ప్రత్యేక ప్రతిభలను వెలికితీసేలా'జాస్ టాలెంటో ఫియెస్టా సుమంగళి ఫంక్షన్ హాల్ గురువారం రోజున అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ తీగల జయలక్ష్మి మాట్లాడుతూ... కళలు,విజ్ఞానం,సాంస్కృతిక కార్యక్రమాలు,సృజనాత్మకత,ఆలోచనా శక్తి వంటి నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉన్నదని.విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలుగొందించి,వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు,ప్రముఖులు విచ్చేసి తిలకించారు. సుమారు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి