పూలే ఆశయాలను కొనసాగిద్దాం..
పూలే ఆశయాలను కొనసాగిద్దాం..
NM Yadav
ఘనంగా మహాత్ముని 200వ జయంతి వేడుకలు..
నివాళులర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు..
నల్లగొండ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబాపూలే 200వ జయంతి వేడుకలను శనివారం నల్లగొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గడియారం సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ మాట్లాడుతూ.. దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం కోసం పూలే పడిన తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు మారగోని గణేష్, పెరిక యాదయ్య, బాణావత్ దీప్లా, పెండెం ధనుంజయ, బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, గంజి రాజేందర్, వజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి