Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదాతల ఆక్రందనలు పట్టని పాలకులు – అశోక్ రెడ్డి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 07:44 PM

నల్లగొండలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్..

నల్లగొండలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్..

నల్లగొండలో అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్..
April 11, 2026 06:07 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

హైవేలపై ఆగివున్నా వాహనలే లక్ష్యంగా డీజిల్ దొంగతనం..


ఆరుగురు నిందితుల అదుపులోకి.. ఒకరు మైనర్..

రూ. 40 లక్షల విలువైన సొత్తు స్వాధీనం..


నల్లగొండ : జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ డీజిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా సభ్యులు గత కొంతకాలంగా రాత్రి సమయాల్లో హైవేలపై లారీలు, ట్రక్కుల నుంచి డీజిల్‌ను తోడేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. శనివారం చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను జిల్లా అదనపు ఎస్పీ జి.రమేష్ వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా హైవేలపై వరుసగా జరుగుతున్న డీజిల్ దొంగతనాలను అరికట్టేందుకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో చిట్యాల పోలీసులు మరియు సీసీఎస్ బృందాలు నిఘా పెంచగా శుక్రవారం రాత్రి హైవేపై అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఒక డీసీఎం వాహనం పోలీసుల కంటపడింది. ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా పైన వడ్ల పట్టాలు కప్పి లోపల రహస్యంగా డీజిల్ నింపిన క్యాన్లను దాచిపెట్టినట్లు గుర్తించారు. డ్రైవర్ బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా పక్కా ప్రణాళికతో సాగుతున్న ఈ ముఠా భాగోతం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు మరో డీసీఎం వాహనంతో పాటు మొత్తం ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పల్నాడు జిల్లాకు చెందిన ముడావత్ గాంధీ నాయక్, ముడావత్ వెంకటేశ్వర్లు, బనావత్ తుల్స్య, ముడావత్ బాలకృష్ణ, రామవత్ వాగ్యలతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నారు. నిందితులు తొలుత హైవేలపై డ్రైవర్లు నిద్రపోతున్న వాహనాలను గుర్తించి, క్షణాల్లో ట్యాంకులు పగులగొట్టి డీజిల్‌ను తమ వాహనాల్లోకి మార్చుకునేవారని పోలీసులు తెలిపారు.

వీరి వద్ద నుంచి రూ. 40 లక్షల విలువైన 1000 లీటర్ల డీజిల్, రెండు డీసీఎంలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు తేలింది. ఈ దొంగతనాల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ శివరాం రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు జితేందర్ రెడ్డి, నాగరాజు మరియు ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలను ప్రకటించారు. హైవేలపై ప్రయాణించే వారు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News