బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే; సీతయ్య
బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే; సీతయ్య
Bandi Kiran Kumar
బడుగు బలహీన ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య లు అన్నారు. శనివారం మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు... అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడలే స్ఫూర్తిగా పయనించాలని పేర్కొన్నారు. మహిళలు చదువుకుంటే వారి కుటుంబము బాగుంటుందని, సమాజం, దేశం బాగుంటుందని, అప్పటిలోనే స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి మహిళల కోసం ఓ ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ మండల నాయకులు తునికి సాయిలు. తడకమళ్ళ రవికుమార్ మట్టిపెల్లి వెంకట్.. ఉప్పలనాగమల్లు అన్నారం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి... మల్లికార్జున. సాయికిరణ్.. వెంకటేష్ . సాయి కుమార్. గోపగాని వెంకన్న పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి