Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:32 PM

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'
April 11, 2026 08:51 PM 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి ఆదేశం

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా చౌటుప్పల్ పోలీస్ యంత్రాంగం సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం చౌటుప్పల్ డీఎస్పీ కార్యాలయంలో మండలంలోని పెట్రోల్ బంక్ యజమానులతో డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి (క్షేమంగా చేరండి - జీవించండి) కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వాహనదారుల ప్రాణ రక్షణ కోసం పెట్రోల్ బంక్ యజమానులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయకూడదు. కార్లలో వచ్చే వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఇంధనం నింపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ కేవలం వాహనాల్లోకి మాత్రమే నింపాలి. బాటిళ్లు, క్యాన్లలో విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని, దీన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి పెట్రోల్ బంకులో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి. అవి కేవలం బంక్ లోపలే కాకుండా, బయట మెయిన్ రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా అమర్చాలని సూచించారు.​"ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలన్నదే మా తపన. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. డీఎస్పీ మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్.ఐ.లు కనకటి యాదగిరి, కె. ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మండలంలోని పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News