Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 03:35 AM

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'

రోడ్డు భద్రతపై ఉక్కుపాదం: 'నో హెల్మెట్ - నో పెట్రోల్'
April 11, 2026 08:51 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి ఆదేశం

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా చౌటుప్పల్ పోలీస్ యంత్రాంగం సరికొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం చౌటుప్పల్ డీఎస్పీ కార్యాలయంలో మండలంలోని పెట్రోల్ బంక్ యజమానులతో డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి (క్షేమంగా చేరండి - జీవించండి) కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, వాహనదారుల ప్రాణ రక్షణ కోసం పెట్రోల్ బంక్ యజమానులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ పోయకూడదు. కార్లలో వచ్చే వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఇంధనం నింపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ కేవలం వాహనాల్లోకి మాత్రమే నింపాలి. బాటిళ్లు, క్యాన్లలో విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని, దీన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి పెట్రోల్ బంకులో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి. అవి కేవలం బంక్ లోపలే కాకుండా, బయట మెయిన్ రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా అమర్చాలని సూచించారు.​"ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరాలన్నదే మా తపన. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. డీఎస్పీ మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్.ఐ.లు కనకటి యాదగిరి, కె. ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, మండలంలోని పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News