సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ
సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ
Editor Desk
ఏప్రిల్ 11 సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయన సేవలను స్మరించుకున్నారు. భారతదేశానికి దారి చూపే ధృవతారగా పూలే నిలిచారని పేర్కొన్నారు.
సామాజిక సంస్కరణలకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, సమానత్వం, విద్యా విస్తరణ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన జీవితాంతం పోరాడారని ప్రధాని తెలిపారు. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇచ్చి విద్యా విప్లవానికి నాంది పలికిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు.
సమాజంలో సమాన హక్కులు సాధించే వరకు నిజమైన స్వేచ్ఛ సాధ్యం కాదన్న పూలే ఆశయాలు నేటికీ మార్గదర్శకమని అన్నారు. సత్యశోధక సమాజం స్థాపన ద్వారా సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన ఉద్యమం దేశ చరిత్రలో కీలకమని పేర్కొన్నారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై పూలే చూపిన దృష్టి విశేషమని, యువత ప్రశ్నించే ధోరణి పెంపొందించుకోవాలని ప్రధాని సూచించారు.
సావిత్రీబాయి పూలే సేవలను కూడా ఈ సందర్భంగా స్మరించిన ప్రధాని, మహిళా విద్యా వికాసంలో ఆమె పాత్ర అపారమని అన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి