Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:03 AM

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి
December 23, 2025 06:45 PM 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

విద్యార్థుల సమస్యలపై కేటీఆర్‌కు వినతి

నార్కట్‌పల్లి స్థానిక ప్రతినిధి

నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు.

యూనివర్సిటీ బీఆర్ఎస్‌వి అధ్యక్షుడు వాడపల్లి నవీన్ నేతృత్వంలో విద్యార్థులు కేటీఆర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ విడుదలతో పాటు గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పోలగోని శివ, శివకుమార్, అశోక్, కోటేష్, సుదీర్, మల్లేష్, లావణ్య, మహేశ్వరి, మానస తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News