Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 02:58 AM

విద్యార్థినీ,విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ హనుమంత రావు

విద్యార్థినీ,విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ హనుమంత రావు

విద్యార్థినీ,విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ హనుమంత రావు
January 08, 2026 06:42 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం: భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్

యదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కోటమర్తి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకి వార్షిక పరీక్షల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు పాల్గొని మాట్లాడుతూ... సమయం చాలా విలువైనదని, విద్యార్థినీ,విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10వ తరగతి విద్యార్థులకి వార్షిక పరీక్షల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన మెటీరియల్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు అనగానే మొదటగా భయపడతారని అలాంటి భయాలు ఏమి పెట్టుకోకుండా,ఈ మెటీరియల్ చదివితే పాస్ అవుతారని తెలిపారు.ప్రతి ఒక్కరి జీవితంలో పదవ తరగతి అనేది చాలా ముఖ్యమైన మలుపు అని,ఇక్కడ పాస్ అయితే పై ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు చదువు తో పాటు జీవితంలో ఎలా స్థిరపడాలో నేర్పిస్తుందని అన్నారు.పదవ తరగతి విద్యార్థులు అందరూ కూడా ఫోన్ లకి, సోషల్ మీడియా కి టీవీ లకి బానిస కాకుండా పుస్తకాలపై శ్రద్ధ పెట్టాలన్నారు .వార్షిక పరీక్షల వరకు రోజు ఉదయం 4 గంటల లేచి చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు హిత బోధ చేశారు.జిల్లాలోని మారుమూల ప్రాంతమైన ఈ గ్రామంలో ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన నేస్తం ఫౌండేషన్ వారికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News