Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు

వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు

వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు
10-04-2026 315 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్‌పర్సన్ చొరవ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం

జాతీయ రహదారి పనుల నేపథ్యంలో తంగడపల్లి రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయాయి. రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు.​పోలీస్ అధికారులతో చర్చలు ​బారికేడ్ల ఏర్పాటుతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఉన్నతాధికారులతో చర్చించారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ విజయ మోహన్, సీఐ మన్మధ కుమార్ లతో మాట్లాడి, ప్రజల ఇబ్బందులను వివరించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే అక్కడి బారికేడ్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.​హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ​చైర్‌పర్సన్ చొరవతో రహదారి క్లియర్ కావడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాక చిరంజీవి

​డీసీసీ కార్యదర్శులు చింతల సాయిలు, బత్తుల లింగస్వామి గౌడ్,​నాయకులు పల్లె సురేందర్ రెడ్డి, శివారెడ్డి, వెంకటేశం, దయాకర్, శ్రీకాంత్, బాబు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు

Article Image

మున్సిపల్ చైర్‌పర్సన్ చొరవ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం

జాతీయ రహదారి పనుల నేపథ్యంలో తంగడపల్లి రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయాయి. రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు.​పోలీస్ అధికారులతో చర్చలు ​బారికేడ్ల ఏర్పాటుతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఉన్నతాధికారులతో చర్చించారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ విజయ మోహన్, సీఐ మన్మధ కుమార్ లతో మాట్లాడి, ప్రజల ఇబ్బందులను వివరించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే అక్కడి బారికేడ్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.​హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ​చైర్‌పర్సన్ చొరవతో రహదారి క్లియర్ కావడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాక చిరంజీవి

​డీసీసీ కార్యదర్శులు చింతల సాయిలు, బత్తుల లింగస్వామి గౌడ్,​నాయకులు పల్లె సురేందర్ రెడ్డి, శివారెడ్డి, వెంకటేశం, దయాకర్, శ్రీకాంత్, బాబు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News