Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:14 AM

వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు

వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు

వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు
April 10, 2026 05:52 PM 311 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ చైర్‌పర్సన్ చొరవ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం

జాతీయ రహదారి పనుల నేపథ్యంలో తంగడపల్లి రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయాయి. రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు.​పోలీస్ అధికారులతో చర్చలు ​బారికేడ్ల ఏర్పాటుతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఉన్నతాధికారులతో చర్చించారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ విజయ మోహన్, సీఐ మన్మధ కుమార్ లతో మాట్లాడి, ప్రజల ఇబ్బందులను వివరించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే అక్కడి బారికేడ్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.​హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ​చైర్‌పర్సన్ చొరవతో రహదారి క్లియర్ కావడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాక చిరంజీవి

​డీసీసీ కార్యదర్శులు చింతల సాయిలు, బత్తుల లింగస్వామి గౌడ్,​నాయకులు పల్లె సురేందర్ రెడ్డి, శివారెడ్డి, వెంకటేశం, దయాకర్, శ్రీకాంత్, బాబు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News