వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు
వాహనదారుల ఇబ్బందులు దూరం: తంగడపల్లి రోడ్డు వద్ద బారికేడ్ల తొలగింపు
K.RAVI
మున్సిపల్ చైర్పర్సన్ చొరవ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం
జాతీయ రహదారి పనుల నేపథ్యంలో తంగడపల్లి రోడ్డు మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయాయి. రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్ల కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు.పోలీస్ అధికారులతో చర్చలు బారికేడ్ల ఏర్పాటుతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఉన్నతాధికారులతో చర్చించారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ విజయ మోహన్, సీఐ మన్మధ కుమార్ లతో మాట్లాడి, ప్రజల ఇబ్బందులను వివరించారు. సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే అక్కడి బారికేడ్లను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు చైర్పర్సన్ చొరవతో రహదారి క్లియర్ కావడంతో వాహనదారులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పాక చిరంజీవి
డీసీసీ కార్యదర్శులు చింతల సాయిలు, బత్తుల లింగస్వామి గౌడ్,నాయకులు పల్లె సురేందర్ రెడ్డి, శివారెడ్డి, వెంకటేశం, దయాకర్, శ్రీకాంత్, బాబు, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి