Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

వెనిజులా చమురు దోపిడీ చేసేందుకే అమెరిక దుర్మార్గం

వెనిజులా చమురు దోపిడీ చేసేందుకే అమెరిక దుర్మార్గం

వెనిజులా చమురు దోపిడీ చేసేందుకే అమెరిక దుర్మార్గం
January 05, 2026 06:09 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వెనిజులాపై అమెరికా దాడిని ఖండించండి

-సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో మరియు ఆయన భార్యని ట్రంప్ ఆదేశాలతో అరెస్ట్ చేసి ఆ దేశంపై అక్రమంగా దాడి చేయడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తు ఖండిస్తుందని చమురు దోపిడి చేసేందుకే అమెరిక ఈ దుర్మార్గానికి పాల్పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ విమర్శించినారు. సోమవారం సిపిఎం పోచంపల్లి మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోచంపల్లి పట్టణంలోని చౌటుప్పల రోడ్డులో " నిరసన " తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ...ఈ దాడితో అమెరికా సామ్రాజ్యవాద ధోరణి బయటపడిందని అన్నారు. వెనుజుల మీద దాడి తర్వాత ట్రంప్ కు ముకుతాడు వేయకుంటే ప్రపంచానికే ప్రమాదమని తెలిపారు. ఒక దేశ అధ్యక్షున్ని అరెస్టు చేయడం అమెరికా సామ్రాజ్యవాద వైఖరికి పరాకాష్టని విమర్శించారు. అమెరికా బరితేగింపు, బడా కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని ప్రపంచమంతా వ్యతిరేకించాలని తెలిపారు. వెంటనే అరెస్ట్ చేసిన ఆదేశ అధ్యక్షుడు మధురో మరియు వారి భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ దుచ్చేరియల పైన ఐక్యరాజ్యసమితి వెంటనే కలుగచేసుకోవాలని కోరారు. అమెరికా సామ్రాజ్యవాద చర్యలు ప్రపంచ ప్రజాస్వామ్యానికి నష్టదాయకమని తెలియజేశారు. భారత ప్రభుత్వం కూడా వెంటనే ఈ చర్యని ఖండించాలని నర్సింహ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ డివిజన్ కార్యదర్శి గూడూరు అంజిరెడ్డి, మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, పార్టీ మాజీ జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ల లింగారెడ్డి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, ప్రసాదం విష్ణు, పట్టణ కమిటీ సభ్యులు వడ్డేపల్లి యాదగిరి, గూడూరు రామిరెడ్డి, పోన్నమోని కృష్ణ, మండల కమిటీ సభ్యులు కల్కూరి బిక్షపతి,సీనియర్ నాయకులు సిలువేరు లాలయ్య ,కొట భూపాల్ రెడ్డి,రజినీ కాంత్,రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News