Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:31 PM

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం
December 16, 2025 06:04 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

వెల్లంకిలో శాంతి శేఖర్‌కు మరోసారి విజయం

స్థానికం ప్రతినిధి రామన్నపేట

రామన్నపేట మండలం వెల్లంకిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆరో వార్డు నుంచి బీఆర్ఎస్–బీజేపీ బలపరిచిన అభ్యర్థి జినుక శాంతి శేఖర్ విజయం సాధించారు. మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆమెకు 10 ఓట్ల మెజారిటీ లభించింది.

తన గెలుపుకు కృషి చేసిన మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, వార్డు ఓటర్లకు శాంతి శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డులోని సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె వెల్లడించారు.

గత ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్‌గా గెలిచిన శాంతి శేఖర్‌కు ఇది వరుస విజయంగా నిలిచింది. ప్రజల మద్దతే తన బలమని, అభివృద్ధే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News