Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:50 AM

వెల్లంకిలో లైబ్రరీని సందర్శించిన పోచంపల్లి లీడేల్ స్కూల్ విద్యార్థులు .

వెల్లంకిలో లైబ్రరీని సందర్శించిన పోచంపల్లి లీడేల్ స్కూల్ విద్యార్థులు .

వెల్లంకిలో లైబ్రరీని సందర్శించిన పోచంపల్లి లీడేల్ స్కూల్ విద్యార్థులు .
January 05, 2026 02:46 PM 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

మండలంలోని వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కూరెళ్ల విఠలాచార్య ఏర్పాటు చేసిన లైబ్రరీని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సోమవారం సందర్శించారు. వెల్లంకి గ్రామానికి చెందిన కర్నాటి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కర్నాటి శ్రవణ్ కుమార్ విఠలాచార్యను శాలువాతో సన్మానించి గ్రంథాలయం కోసం పుస్తకాలను, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగ విఠలాచార్య మాట్లాడుతూ గ్రంధాలయాలు, విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలని పుస్తకాలు ఉన్నచోట న దేవతలు ఉంటారని, నా వద్ద విద్యాభ్యాసం చేసిన పలువురు అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో రాణిస్తున్నారని అందులో తమ గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు పోచంపల్లిలో లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించడం అభినందనీయమని, ఇలాంటి మరెన్నో స్కూలు ఏర్పాటు చేసి తమ గ్రామానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నాటి ఎడ్యుకేషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కర్నాటి మహదేవ్, కర్నాటి నరసింహ,గంజి భాస్కర్, లైబ్రేరియన్ తాటిపాముల స్వామి, వనం శిరీష, స్కూలు ప్రిన్సిపాల్ కాశీనాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News