Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:39 PM

వెల్లంకిలో లైబ్రరీని సందర్శించిన పోచంపల్లి లీడేల్ స్కూల్ విద్యార్థులు .

వెల్లంకిలో లైబ్రరీని సందర్శించిన పోచంపల్లి లీడేల్ స్కూల్ విద్యార్థులు .

వెల్లంకిలో లైబ్రరీని సందర్శించిన పోచంపల్లి లీడేల్ స్కూల్ విద్యార్థులు .
January 05, 2026 02:46 PM 118 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రతినిధి

మండలంలోని వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య కూరెళ్ల విఠలాచార్య ఏర్పాటు చేసిన లైబ్రరీని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సోమవారం సందర్శించారు. వెల్లంకి గ్రామానికి చెందిన కర్నాటి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ కర్నాటి శ్రవణ్ కుమార్ విఠలాచార్యను శాలువాతో సన్మానించి గ్రంథాలయం కోసం పుస్తకాలను, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగ విఠలాచార్య మాట్లాడుతూ గ్రంధాలయాలు, విద్యాలయాలు విజ్ఞాన భాండాగారాలని పుస్తకాలు ఉన్నచోట న దేవతలు ఉంటారని, నా వద్ద విద్యాభ్యాసం చేసిన పలువురు అన్ని రంగాలలో అగ్రశ్రేణిలో రాణిస్తున్నారని అందులో తమ గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు పోచంపల్లిలో లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించడం అభినందనీయమని, ఇలాంటి మరెన్నో స్కూలు ఏర్పాటు చేసి తమ గ్రామానికి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నాటి ఎడ్యుకేషన్ సొసైటీ ఉపాధ్యక్షులు కర్నాటి మహదేవ్, కర్నాటి నరసింహ,గంజి భాస్కర్, లైబ్రేరియన్ తాటిపాముల స్వామి, వనం శిరీష, స్కూలు ప్రిన్సిపాల్ కాశీనాథ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News