PRINT TIME: April 12, 2026 01:39 AM
వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ
వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ
January 08, 2026 02:52 PM
11 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని చిట్యాల మున్సిపాలిటీ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ కోనేటి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగ చిట్యాల పట్టణానికి సంబంధించిన స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కోనేటి కృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డు పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేకు వివరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగగా, స్థానిక రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి