Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:11 AM

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం
December 21, 2025 06:50 AM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మెల్యే నివాసంలో శబరిమల వైభవం

ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ

స్థానిక ప్రతినిధి నకిరేకల్

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన స్వగృహంలో స్వామి అయ్యప్ప మహాపడి పూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి శ్రీమన్ శ్రీ సి. వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేదమంత్రాల మధ్య ఐదు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పంచామృతాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకాలతో స్వామిని అలంకరించి హారతి ఇచ్చారు. ఎమ్మెల్యే వీరేశం కుమారుడితో కలిసి స్వయంగా పూజల్లో పాల్గొన్నారు. ‘స్వామి శరణం–అయ్యప్ప శరణం’ శరణుఘోషలతో పన్నాలగూడెం పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.

అయ్యప్ప దీక్ష కులమతాలకు అతీతమై అందరినీ ఒక్కటిగా నిలుపుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామిని ప్రార్థించారు. వచ్చే ఏడాది నుంచి నకిరేకల్ పట్టణంలో అయ్యప్ప స్వాములకు బిక్ష, అల్పాహార ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News