Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:12 AM

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం
21-12-2025 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మెల్యే నివాసంలో శబరిమల వైభవం

ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ

స్థానిక ప్రతినిధి నకిరేకల్

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన స్వగృహంలో స్వామి అయ్యప్ప మహాపడి పూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి శ్రీమన్ శ్రీ సి. వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేదమంత్రాల మధ్య ఐదు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పంచామృతాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకాలతో స్వామిని అలంకరించి హారతి ఇచ్చారు. ఎమ్మెల్యే వీరేశం కుమారుడితో కలిసి స్వయంగా పూజల్లో పాల్గొన్నారు. ‘స్వామి శరణం–అయ్యప్ప శరణం’ శరణుఘోషలతో పన్నాలగూడెం పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.

అయ్యప్ప దీక్ష కులమతాలకు అతీతమై అందరినీ ఒక్కటిగా నిలుపుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామిని ప్రార్థించారు. వచ్చే ఏడాది నుంచి నకిరేకల్ పట్టణంలో అయ్యప్ప స్వాములకు బిక్ష, అల్పాహార ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

Sthanikam

వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం

Article Image

ఎమ్మెల్యే నివాసంలో శబరిమల వైభవం

ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ

స్థానిక ప్రతినిధి నకిరేకల్

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన స్వగృహంలో స్వామి అయ్యప్ప మహాపడి పూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి శ్రీమన్ శ్రీ సి. వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేదమంత్రాల మధ్య ఐదు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పంచామృతాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకాలతో స్వామిని అలంకరించి హారతి ఇచ్చారు. ఎమ్మెల్యే వీరేశం కుమారుడితో కలిసి స్వయంగా పూజల్లో పాల్గొన్నారు. ‘స్వామి శరణం–అయ్యప్ప శరణం’ శరణుఘోషలతో పన్నాలగూడెం పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.

అయ్యప్ప దీక్ష కులమతాలకు అతీతమై అందరినీ ఒక్కటిగా నిలుపుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామిని ప్రార్థించారు. వచ్చే ఏడాది నుంచి నకిరేకల్ పట్టణంలో అయ్యప్ప స్వాములకు బిక్ష, అల్పాహార ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News