వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం
వేదమంత్రాల మధ్య ఎమ్మెల్యే ఇంట శబరిమల వాతావరణం
Editor Desk
ఎమ్మెల్యే నివాసంలో శబరిమల వైభవం
ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ
స్థానిక ప్రతినిధి నకిరేకల్
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన స్వగృహంలో స్వామి అయ్యప్ప మహాపడి పూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురుస్వామి శ్రీమన్ శ్రీ సి. వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేదమంత్రాల మధ్య ఐదు గంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పంచామృతాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకాలతో స్వామిని అలంకరించి హారతి ఇచ్చారు. ఎమ్మెల్యే వీరేశం కుమారుడితో కలిసి స్వయంగా పూజల్లో పాల్గొన్నారు. ‘స్వామి శరణం–అయ్యప్ప శరణం’ శరణుఘోషలతో పన్నాలగూడెం పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి.
అయ్యప్ప దీక్ష కులమతాలకు అతీతమై అందరినీ ఒక్కటిగా నిలుపుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామిని ప్రార్థించారు. వచ్చే ఏడాది నుంచి నకిరేకల్ పట్టణంలో అయ్యప్ప స్వాములకు బిక్ష, అల్పాహార ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి