PRINT TIME: May 26, 2026 04:33 PM
వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ
వడ్లు కొనమంటే కేసులా..! రైతులపై కేసులు పెట్టడం దారుణం. మాజీ ఎంపీపీ
May 20, 2026 08:37 AM
46 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట,
రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపడితే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, బలరాం మండిపడ్డారు.
మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి