వడ్ల కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఉమా హారతి
వడ్ల కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఉమా హారతి
Krishna
నారాయణఖేడ్ మండలం నరసాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని డిఎన్టి తండాలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న వడ్ల కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, నిల్వలు తదితర అంశాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వడ్ల విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకోగా, లారీల కొరత కారణంగా కొనుగోలు చేసిన వడ్లను రైస్ మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు, ఐకెపి సిబ్బంది తెలిపారు. లారీలను సక్రమంగా అందుబాటులో ఉంచితే రైతులు తీసుకొచ్చిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించే అవకాశం ఉంటుందని వారు వివరించారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి, లారీల కొరత సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రస్తుతం కేంద్రంలో వడ్ల కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని రైతులు ఖేఢ్ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి