Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:04 AM

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు.  తిమ్మాపురం మహేందర్ రెడ్డి
May 17, 2026 04:12 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఆదివారం మండల విలేకరులతో మాట్లాడుతూ రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎప్పటికప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు సహకరించాల్సింది పోయి రాస్తారోకోలు, ధర్నాల పేరుతో అలజడి సృష్టించడం సరికాదన్నారు. రైతులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News