వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి
వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి
Editor Desk
రామన్నపేట: వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఆదివారం మండల విలేకరులతో మాట్లాడుతూ రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎప్పటికప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
రైతులకు సహకరించాల్సింది పోయి రాస్తారోకోలు, ధర్నాల పేరుతో అలజడి సృష్టించడం సరికాదన్నారు. రైతులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి