Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు.  తిమ్మాపురం మహేందర్ రెడ్డి
17-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఆదివారం మండల విలేకరులతో మాట్లాడుతూ రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎప్పటికప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు సహకరించాల్సింది పోయి రాస్తారోకోలు, ధర్నాల పేరుతో అలజడి సృష్టించడం సరికాదన్నారు. రైతులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Sthanikam

వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ కుట్రలు. తిమ్మాపురం మహేందర్ రెడ్డి

Article Image

రామన్నపేట: వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తే సహించేది లేదని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

ఆదివారం మండల విలేకరులతో మాట్లాడుతూ రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎప్పటికప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

రైతులకు సహకరించాల్సింది పోయి రాస్తారోకోలు, ధర్నాల పేరుతో అలజడి సృష్టించడం సరికాదన్నారు. రైతులను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News