Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:09 PM

ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
February 19, 2026 07:22 PM 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్ గిద్ధ మండల పరిధిలోని ఉటుపల్లి గ్రామంలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామంలో దేశభక్తి, సాంస్కృతిక స్పూర్తిని మరింత పెంపొందించింది.ఈ సందర్భంగా సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ పెద్దలు, యువకులు కలిసి మహారాజ్ మహోన్నత సేవలను స్మరించుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత డాక్టర్ డి. ఓం ప్రకాష్ గారు మాట్లాడుతూ, కోట్లాది భారతీయులకు శాశ్వత స్పూర్తి ప్రదాతగా నిలిచిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవిత విశేషాలను వివరించారు. భారతమాత ముద్దుబిడ్డగా పేరుగాంచిన ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, మొఘల్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదిరించి స్వరాజ్య స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. స్త్రీలకు గౌరవం, ధర్మ పరిరక్షణ, పరిపాలనా దక్షతలో ఆయన చూపిన ఆదర్శం యుగయుగాల పాటు ప్రజలకు మార్గదర్శకమని తెలిపారు.ఈ వేడుకల్లో వర్డ్ మెంబర్ జమీర్ గారు, గ్రామ పెద్దలు నాగప్ప, రామన్న, రామ్ చందర్, హనుమంత్, సంజీవ్, లక్ష్మణ్, నగేష్ గార్లు, అలాగే గ్రామ యువ నాయకులు సుభాస్, శంకర్, ప్రదీప్, మనోహర్, శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ జయంతి వేడుకలు గ్రామంలో ఐక్యత, దేశభక్తి, సాంస్కృతిక గౌరవాన్ని మరింత బలపరిచిన సందర్భంగా నిలిచాయి. యువతరం మహానుభావుల జీవితం నుండి ప్రేరణ పొందుతూ సమాజ సేవలో ముందుకు రావాలని పెద్దలు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News