ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
Krishna
నాగల్ గిద్ధ మండల పరిధిలోని ఉటుపల్లి గ్రామంలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామంలో దేశభక్తి, సాంస్కృతిక స్పూర్తిని మరింత పెంపొందించింది.ఈ సందర్భంగా సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ పెద్దలు, యువకులు కలిసి మహారాజ్ మహోన్నత సేవలను స్మరించుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత డాక్టర్ డి. ఓం ప్రకాష్ గారు మాట్లాడుతూ, కోట్లాది భారతీయులకు శాశ్వత స్పూర్తి ప్రదాతగా నిలిచిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవిత విశేషాలను వివరించారు. భారతమాత ముద్దుబిడ్డగా పేరుగాంచిన ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, మొఘల్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదిరించి స్వరాజ్య స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. స్త్రీలకు గౌరవం, ధర్మ పరిరక్షణ, పరిపాలనా దక్షతలో ఆయన చూపిన ఆదర్శం యుగయుగాల పాటు ప్రజలకు మార్గదర్శకమని తెలిపారు.ఈ వేడుకల్లో వర్డ్ మెంబర్ జమీర్ గారు, గ్రామ పెద్దలు నాగప్ప, రామన్న, రామ్ చందర్, హనుమంత్, సంజీవ్, లక్ష్మణ్, నగేష్ గార్లు, అలాగే గ్రామ యువ నాయకులు సుభాస్, శంకర్, ప్రదీప్, మనోహర్, శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ జయంతి వేడుకలు గ్రామంలో ఐక్యత, దేశభక్తి, సాంస్కృతిక గౌరవాన్ని మరింత బలపరిచిన సందర్భంగా నిలిచాయి. యువతరం మహానుభావుల జీవితం నుండి ప్రేరణ పొందుతూ సమాజ సేవలో ముందుకు రావాలని పెద్దలు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి