Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:48 PM

ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఉటుపల్లిలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
February 19, 2026 07:22 PM 258 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్ గిద్ధ మండల పరిధిలోని ఉటుపల్లి గ్రామంలో సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామంలో దేశభక్తి, సాంస్కృతిక స్పూర్తిని మరింత పెంపొందించింది.ఈ సందర్భంగా సర్పంచ్ తిమ్మాపూర్ నాగమ్మ పండరి గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ పెద్దలు, యువకులు కలిసి మహారాజ్ మహోన్నత సేవలను స్మరించుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత డాక్టర్ డి. ఓం ప్రకాష్ గారు మాట్లాడుతూ, కోట్లాది భారతీయులకు శాశ్వత స్పూర్తి ప్రదాతగా నిలిచిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జీవిత విశేషాలను వివరించారు. భారతమాత ముద్దుబిడ్డగా పేరుగాంచిన ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, మొఘల్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదిరించి స్వరాజ్య స్థాపనకు కృషి చేశారని కొనియాడారు. స్త్రీలకు గౌరవం, ధర్మ పరిరక్షణ, పరిపాలనా దక్షతలో ఆయన చూపిన ఆదర్శం యుగయుగాల పాటు ప్రజలకు మార్గదర్శకమని తెలిపారు.ఈ వేడుకల్లో వర్డ్ మెంబర్ జమీర్ గారు, గ్రామ పెద్దలు నాగప్ప, రామన్న, రామ్ చందర్, హనుమంత్, సంజీవ్, లక్ష్మణ్, నగేష్ గార్లు, అలాగే గ్రామ యువ నాయకులు సుభాస్, శంకర్, ప్రదీప్, మనోహర్, శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ జయంతి వేడుకలు గ్రామంలో ఐక్యత, దేశభక్తి, సాంస్కృతిక గౌరవాన్ని మరింత బలపరిచిన సందర్భంగా నిలిచాయి. యువతరం మహానుభావుల జీవితం నుండి ప్రేరణ పొందుతూ సమాజ సేవలో ముందుకు రావాలని పెద్దలు ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News