ఉత్తమ విద్యుత్ అధికారి పురస్కార గ్రహీత ఏఈకి యాదవ సంఘ నేతలు సన్మానం
ఉత్తమ విద్యుత్ అధికారి పురస్కార గ్రహీత ఏఈకి యాదవ సంఘ నేతలు సన్మానం
K.RAVI
విద్యుత్ సేవలలో విశేష ప్రతిభ కనబరిచిన చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్ యాదవ్ భువనగిరి జిల్లా కేంద్రంలో 77వ గణతంత్ర వేడుకలలో జిల్లా స్థాయి ఉత్తమ అధికారి పురస్కారంను జిల్లా కలెక్టర్ హనుమంత రావు,ఎస్పి ఆకాంక్ష యాదవ్ చేతులమీదుగా ప్రశంస పత్రాన్ని స్వికరించారు.ఈ సందర్బంగా చౌటుప్పల మండల, పట్టణ యాదవ సంఘం కమిటీ మండల అధ్యక్షుడు చినుకని మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ సతీష్ యాదవ్ ను కలిసి అభినందనలు తెలిపారు. ఉత్తమ అధికారి పురస్కారం రావడంపట్ల హర్షంవ్యక్తపరుస్తూ శాలువతో ఘనంగా సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు.ఈ కార్యక్రమంలో గుండెబోయిన అయోధ్య యాదవ్, చిలకల శ్రీనివాస్ యాదవ్, నల్ల పర్వతాలు యాదవ్, గంగనబోయిన వెంకటేష్ యాదవ్, గజ్జి పాండు యాదవ్,నల్ల గణేష్ యాదవ్, ఆవుల ఏసు యాదవ్, ఆవుల మల్లయ్య యాదవ్, గుండెబోయిన వేణు యాదవ్, గుణమోని లింగస్వామి యాదవ్, గుణమోని బాలకృష్ణ యాదవ్, బద్దుల సుధాకర్ యాదవ్, మెండే మల్లేష్ యాదవ్, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి