Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:07 AM

ఉత్తమ విద్యార్థులు, అధ్యాపకులకు ఘన సన్మానం

ఉత్తమ విద్యార్థులు, అధ్యాపకులకు ఘన సన్మానం

ఉత్తమ విద్యార్థులు, అధ్యాపకులకు ఘన సన్మానం
13-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు మూడో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా–సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ కార్యక్రమాల్లో విశేష ప్రతిభ చాటిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న అధ్యాపకులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభను చాటినప్పుడే విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చెనగోని వెంకట్‌గౌడ్‌, అద్దంకి ఆంజనేయులు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మీ నీలిమ పాల్గొన్నారు.

అలాగే అధ్యాపకులు డాక్టర్‌ జి. సునీత, డాక్టర్‌ డి. కిషన్‌, డాక్టర్‌ పి. బ్రహ్మం, డాక్టర్‌ ఎం. రవీందర్‌రావు, టి. శ్రీనివాస్‌, రవితో పాటు కార్యాలయ సిబ్బంది ఫయాజ్‌, షరీఫ్‌, శ్రీదేవి, బసవయ్య, రాంబాబు, కిరణ్‌, నవీన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఉత్తమ విద్యార్థులు, అధ్యాపకులకు ఘన సన్మానం

Article Image

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు మూడో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా–సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ కార్యక్రమాల్లో విశేష ప్రతిభ చాటిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న అధ్యాపకులను కూడా ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి కళాశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభను చాటినప్పుడే విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చెనగోని వెంకట్‌గౌడ్‌, అద్దంకి ఆంజనేయులు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మీ నీలిమ పాల్గొన్నారు.

అలాగే అధ్యాపకులు డాక్టర్‌ జి. సునీత, డాక్టర్‌ డి. కిషన్‌, డాక్టర్‌ పి. బ్రహ్మం, డాక్టర్‌ ఎం. రవీందర్‌రావు, టి. శ్రీనివాస్‌, రవితో పాటు కార్యాలయ సిబ్బంది ఫయాజ్‌, షరీఫ్‌, శ్రీదేవి, బసవయ్య, రాంబాబు, కిరణ్‌, నవీన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News