Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

ఊరూరా ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

ఊరూరా ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

ఊరూరా ఘనంగా సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు
March 29, 2026 09:14 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- గుల్లపల్లి వెంకటేష్ గౌడ్

- ఏప్రిల్ 2న విప్లవ వీరుడికి నివాళులు మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుల పిలపు

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని ఏప్రిల్ 2వ తేదీన జిల్లావ్యాప్తంగా ఊరూరా,వాడవాడలా ఘనంగా నిర్వహించాలని గౌడ జనహక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జిల్లా అధ్యక్షులు గుల్లపల్లి వెంకటేష్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పాపన్న గౌడ్ వీరోచిత చరిత్రను,ఆయన చేసిన పోరాటాలను నేటి తరానికి చాటిచెప్పాలని కోరారు.ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ..మొఘల్ సామ్రాజ్య క్రూర పాలనకు,జమీందార్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు.1650లో ఖిలాషాపూర్ గ్రామంలో సామాన్య గౌడ కుటుంబంలో జన్మించిన ఆయన,అణగారిన వర్గాలను ఏకం చేసి మొఘల్ సైన్యాన్ని గడగడలాడించారని గుర్తు చేశారు.దళితులు,వెనుకబడిన వర్గాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసి,గెరిల్లా యుద్ధం ద్వారా మొఘలులకు ప్రధాన శత్రువుగా మారారు.ఖిలాషాపూర్,తాడికొండ,భువనగిరి వంటి చోట్ల కోటలు నిర్మించి సార్వభౌమాధికారాన్ని చాటారు.1708లో వరంగల్ కోటను ఆక్రమించి విజయ పతాకం ఎగురవేశారు. ఆలయాల ధ్వంసాన్ని అడ్డుకుంటూ,మహిళల గౌరవాన్ని కాపాడుతూ'అపర శివాజీగా,హిందూ ధర్మ పరిరక్షకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం పాపన్న గౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో,ఏప్రిల్ 2న ప్రతి గ్రామంలో గౌడ కుల బాంధవులు,బహుజనులు ఐక్యంగా పాల్గొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని వెంకటేష్ గౌడ్ కోరారు.ఆత్మగౌరవం,సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాటలో నడవడమే పాపన్న గౌడ్ కు మనం ఇచ్చే నిజమైన గౌరవమని ఆయన అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News