ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు
ఉరుమడ్ల గ్రామం లొ ముగిసిన మండల స్థాయి క్రీడలు
Komidala Mahender reddy
చిట్యాల స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్న ఉరుమడ్ల గ్రామంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని కీర్తిశేషులు సోమనబోయిన నాగేష్ జ్ఞాపకార్థంగా తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో వాలీబాల్, కబడ్డీ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీల ముగింపు కార్యక్రమం మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ మండల స్థాయి ఆటల పోటీలో ఆరగుడం గ్రామానికి చెందిన కబడ్డీ జట్టు ప్రథమ బహుమతి, తాళ్ల వెల్లంల గ్రామం ద్వితీయ బహుమతి పొందారు. వాలీబాల్ ఆటవి భాగంలో ఉరుమడ్ల గ్రామ జట్టు ప్రథమ బహుమతి సాధించారు. ఈ ఆటల పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఉరుమడ్ల సర్పంచ్ భాను శ్రీ బిక్షం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలు సామాజిక స్పృహను, కలిగిస్తాయని, వాటి ద్వారా మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మరియు వార్డ్ నెంబర్లు సీనియర్ క్రీడాకారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి