PRINT TIME: July 11, 2026 04:54 AM
ఉరుమడ్ల లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఉరుమడ్ల లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
April 02, 2026 10:29 AM
198 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వడ్ల కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించే విధంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు.రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని, తేమ శాతం, తూకం వంటి అంశాల్లో పారదర్శకత పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి