Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 11:05 PM

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం

ఉరడమ్మ జాతర, విశ్వనందగిరి ఆశ్రమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు ఘన స్వాగతం
May 13, 2026 06:12 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగాయి. గుంజేటి గ్రామంలో నిర్వహించిన శ్రీ ఉరడమ్మ జాతర మహా పూర్ణ హారతి కార్యక్రమంలో

హారతి చేస్తున్న దృశ్యం

జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేశెట్టి పాటిల్ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, భక్తులు ఘన స్వాగతం పలికారు.అలాగే న్యామతాబాద్ గ్రామంలో శ్రీ విశ్వనందగిరి ఆశ్రమం 23వ వార్షికోత్సవం, అఖండ నామస్మరణ సప్తాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు. ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి నామస్మరణలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, భక్తి భావన పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరింహ రెడ్డి, హద్నూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్, హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్, నాయకులు రాజ్‌కుమార్, రాజు పటేల్, అశోక్, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News