Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:30 PM

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..
15-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దూడ రాజనార్సుబాబు ఈరోజు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి శ్రీ లక్ష్మణ్ కుమార్ ను కలిశారు. వారు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పిఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.అంతేకాక, ఉపాధ్యాయులు ప్రభుత్వపరంగా రావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, హెల్త్ కార్డులను, హెల్త్ ట్రస్టు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ కార్యక్రమాలను అధికారికంగా మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించాలని, రిటైర్మెంట్ అయిన రోజునే వారికి పెన్షన్ పత్రాలను మంజూరు చేయాలని వారు కోరారు.అదేవిధంగా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ కోసం అడ్డంకి గా ఉన్న "అడాక్వసి" అనే పదాన్ని తొలగించి, ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకూ ప్రమోషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే 342 జీవో ప్రకారం ప్రస్తుతంలో బీఈడీకి ఇస్తున్న అనుమతిని ఇతర పీజీ కోర్సులు చదివేందుకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లను మంత్రికి అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లు మరియు డైరీలను గౌరవ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడ రాజనర్సు బాబు, రాము నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దూడ రాజనార్సుబాబు ఈరోజు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి శ్రీ లక్ష్మణ్ కుమార్ ను కలిశారు. వారు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పిఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.అంతేకాక, ఉపాధ్యాయులు ప్రభుత్వపరంగా రావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, హెల్త్ కార్డులను, హెల్త్ ట్రస్టు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ కార్యక్రమాలను అధికారికంగా మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించాలని, రిటైర్మెంట్ అయిన రోజునే వారికి పెన్షన్ పత్రాలను మంజూరు చేయాలని వారు కోరారు.అదేవిధంగా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ కోసం అడ్డంకి గా ఉన్న "అడాక్వసి" అనే పదాన్ని తొలగించి, ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకూ ప్రమోషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే 342 జీవో ప్రకారం ప్రస్తుతంలో బీఈడీకి ఇస్తున్న అనుమతిని ఇతర పీజీ కోర్సులు చదివేందుకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లను మంత్రికి అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లు మరియు డైరీలను గౌరవ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడ రాజనర్సు బాబు, రాము నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News