ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి..
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జాదవ్ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దూడ రాజనార్సుబాబు ఈరోజు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల శాఖ మంత్రి శ్రీ లక్ష్మణ్ కుమార్ ను కలిశారు. వారు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పిఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.అంతేకాక, ఉపాధ్యాయులు ప్రభుత్వపరంగా రావాల్సిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, హెల్త్ కార్డులను, హెల్త్ ట్రస్టు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ కార్యక్రమాలను అధికారికంగా మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించాలని, రిటైర్మెంట్ అయిన రోజునే వారికి పెన్షన్ పత్రాలను మంజూరు చేయాలని వారు కోరారు.అదేవిధంగా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ కోసం అడ్డంకి గా ఉన్న "అడాక్వసి" అనే పదాన్ని తొలగించి, ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులకూ ప్రమోషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే 342 జీవో ప్రకారం ప్రస్తుతంలో బీఈడీకి ఇస్తున్న అనుమతిని ఇతర పీజీ కోర్సులు చదివేందుకు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లను మంత్రికి అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లు మరియు డైరీలను గౌరవ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడ రాజనర్సు బాబు, రాము నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి