Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:51 PM

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి
January 09, 2026 01:14 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివి నాయక్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వాంకుడోతు వెంకన్న (వివి) నాయక్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు

శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉపాధ్యాయుల న్యాయబద్ధమైన డిమాండ్లు, సమస్యలను పరిష్కరించడంలో పాలకులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే, నూతన పెన్షన్ విధానాన్ని (ఎన్‌పీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) కొనసాగించాలని,

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగా రెడ్డి, ఉపాధ్యాయులు సిద్దిక్ పాషా, చిలకమ్మ, నూస్రత్ బేగం, అరుణ, ఎస్.రాములు, కవిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News