Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి
January 09, 2026 01:14 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివి నాయక్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వాంకుడోతు వెంకన్న (వివి) నాయక్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు

శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉపాధ్యాయుల న్యాయబద్ధమైన డిమాండ్లు, సమస్యలను పరిష్కరించడంలో పాలకులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే, నూతన పెన్షన్ విధానాన్ని (ఎన్‌పీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) కొనసాగించాలని,

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగా రెడ్డి, ఉపాధ్యాయులు సిద్దిక్ పాషా, చిలకమ్మ, నూస్రత్ బేగం, అరుణ, ఎస్.రాములు, కవిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News