ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి
ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను పరిష్కరించాలి
Biksham
ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివి నాయక్
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ఉపాధ్యాయుల అపరిస్కృత సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వాంకుడోతు వెంకన్న (వివి) నాయక్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు
శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉపాధ్యాయుల న్యాయబద్ధమైన డిమాండ్లు, సమస్యలను పరిష్కరించడంలో పాలకులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే, నూతన పెన్షన్ విధానాన్ని (ఎన్పీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) కొనసాగించాలని,
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగా రెడ్డి, ఉపాధ్యాయులు సిద్దిక్ పాషా, చిలకమ్మ, నూస్రత్ బేగం, అరుణ, ఎస్.రాములు, కవిత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి