ఉపాధి పనికి వెళ్లి వృద్ధురాలి మృతి
ఉపాధి పనికి వెళ్లి వృద్ధురాలి మృతి
Biksham
తీవ్ర ఎండలతో అస్వస్థత.. మొగ్గయ్యగూడెంలో విషాదం
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన ఓ వృద్ధురాలు తీవ్ర ఎండల కారణంగా అస్వస్థతకు గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన షేక్ జానమ్మ (65) శనివారం ఉదయం గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లింది.
ఉదయం నుంచే మండుతున్న ఎండల మధ్య పని చేసిన జానమ్మ మధ్యాహ్న సమయంలో ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆమెకు తీవ్ర అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం తీసుకెళ్లేలోపే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జానమ్మ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధి పనులకు వెళ్లే కార్మికులకు తీవ్ర ఎండల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో పనివేళలను ఉదయం సమయానికే పరిమితం చేసి, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి