Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:59 PM

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
January 28, 2026 03:54 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్


తుంగతుర్తి  : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరును మార్చడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ ఆదేశాల మేరకు గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామ పంచాయతీతో పాటు సింగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి, పథకం పేరును మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తుందో వారికి వివరించారు. గ్రామీణ పేదలు, కూలీలకు ఈ పథకం జీవనాధారమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాసం వెంకన్న, వెలుగుపల్లి గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ కన్నారెడ్డి, మాజీ మండల పరిషత్ సభ్యుడు సోమ్లా నాయక్, సింగారం తండా గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త రామడుగు నవీన్ చారి, నాయకులు దయ్యాల వెంకటనారాయణతో పాటు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News