Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:08 AM

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
28-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్


తుంగతుర్తి  : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరును మార్చడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ ఆదేశాల మేరకు గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామ పంచాయతీతో పాటు సింగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి, పథకం పేరును మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తుందో వారికి వివరించారు. గ్రామీణ పేదలు, కూలీలకు ఈ పథకం జీవనాధారమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాసం వెంకన్న, వెలుగుపల్లి గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ కన్నారెడ్డి, మాజీ మండల పరిషత్ సభ్యుడు సోమ్లా నాయక్, సింగారం తండా గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త రామడుగు నవీన్ చారి, నాయకులు దయ్యాల వెంకటనారాయణతో పాటు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


Sthanikam

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్


తుంగతుర్తి  : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరును మార్చడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ ఆదేశాల మేరకు గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామ పంచాయతీతో పాటు సింగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి, పథకం పేరును మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తుందో వారికి వివరించారు. గ్రామీణ పేదలు, కూలీలకు ఈ పథకం జీవనాధారమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాసం వెంకన్న, వెలుగుపల్లి గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ కన్నారెడ్డి, మాజీ మండల పరిషత్ సభ్యుడు సోమ్లా నాయక్, సింగారం తండా గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త రామడుగు నవీన్ చారి, నాయకులు దయ్యాల వెంకటనారాయణతో పాటు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News