ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్
తుంగతుర్తి : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్న పేరును మార్చడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వ ఆదేశాల మేరకు గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి గ్రామ పంచాయతీతో పాటు సింగారం తండా గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి, పథకం పేరును మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తుందో వారికి వివరించారు. గ్రామీణ పేదలు, కూలీలకు ఈ పథకం జీవనాధారమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాసం వెంకన్న, వెలుగుపల్లి గ్రామ సర్పంచ్ సోలిపురం అశ్వినీ కన్నారెడ్డి, మాజీ మండల పరిషత్ సభ్యుడు సోమ్లా నాయక్, సింగారం తండా గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త రామడుగు నవీన్ చారి, నాయకులు దయ్యాల వెంకటనారాయణతో పాటు గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి