Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:51 PM

ఉపాధి హామీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి

ఉపాధి హామీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి

ఉపాధి హామీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం దాడి
February 04, 2026 06:49 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు ఏఐపీకేఎంఎస్ మద్దతు

ఖమ్మం:

గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు విమర్శించారు. బుధవారం వైరా డివిజన్ అధ్యక్షుడు ఎస్.కే.జానీ అధ్యక్షతన విక్రమ్ భవనంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను ఉద్యమాల భయంతో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దొడ్డిదారిన నాలుగు కార్మిక కోడులను ప్రవేశపెట్టి కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. వికసిత్ భారత్ పేరిట కొత్త పథకాలను తెచ్చి కోట్లాది గ్రామీణ కూలీల పని హక్కును లాక్కునే కుట్ర జరుగుతోందన్నారు. ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదల హక్కు అని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది దళితులు, గిరిజనులు, భూమిలేని కూలీలు ఈ చట్టంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు కార్మిక కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఏఐపీకేఎంఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు, కంకణాల పెద వెంకటి, తడికమాల వెంకన్న, సాగి అప్పారావు, ఆవుల భద్రయ్య, సుబ్బారావు, చిన్న వెంకటి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News