Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె
09-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : కొండమడుగు నర్సింహ

ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, విబి-జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 15న దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామీణ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వైద్య సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూలీల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, పే స్లిప్‌లు ఇవ్వడం లేదని విమర్శించారు.రోజుకు రూ.800 కూలి, సంవత్సరానికి 200 రోజుల పని, ప్రతి కార్మికుడికి అవసరమైన పనిముట్లు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గంగాదేవి సైదులు మాట్లాడుతూ ఈనెల 13న నిర్వహించే మండల మహాసభలో కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు మానే సాలయ్య, సహాయ కార్యదర్శి రాపోతు పద్మ, మండల నాయకురాలు చెరుకు లక్ష్మమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ చినగొని అనిత, కార్మికులు జంగమ్మ, సత్తమ్మ, పద్మ, కమలమ్మ, బుచ్చమ్మ, జయలక్ష్మి, కలమ్మ, అశోక్, సంతోష, జయమ్మ, పూలమ్మ, మహాంకాళి, లావణ్య, జ్ఞానేశ్వరి, అంజమ్మ, జయమ్మ, అనిత, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె

Article Image

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : కొండమడుగు నర్సింహ

ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, విబి-జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 15న దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామీణ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వైద్య సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూలీల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని, పే స్లిప్‌లు ఇవ్వడం లేదని విమర్శించారు.రోజుకు రూ.800 కూలి, సంవత్సరానికి 200 రోజుల పని, ప్రతి కార్మికుడికి అవసరమైన పనిముట్లు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గంగాదేవి సైదులు మాట్లాడుతూ ఈనెల 13న నిర్వహించే మండల మహాసభలో కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు మానే సాలయ్య, సహాయ కార్యదర్శి రాపోతు పద్మ, మండల నాయకురాలు చెరుకు లక్ష్మమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ చినగొని అనిత, కార్మికులు జంగమ్మ, సత్తమ్మ, పద్మ, కమలమ్మ, బుచ్చమ్మ, జయలక్ష్మి, కలమ్మ, అశోక్, సంతోష, జయమ్మ, పూలమ్మ, మహాంకాళి, లావణ్య, జ్ఞానేశ్వరి, అంజమ్మ, జయమ్మ, అనిత, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News