రామన్నపేట,
మండలంలోని కొమ్మయిగూడెంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను రామన్నపేట ఎంపీడీవో రాములు శుక్రవారం పరిశీలించారు. కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, పనుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పనిచేస్తున్న కూలీలకు తాగునీటి సౌకర్యం, నీడ ఏర్పాట్లు సమర్థంగా ఉండేలా చూడాలని సూచించారు. కూలీల హాజరు నమోదును కూడా తనిఖీ చేసి పనులు నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హరికృష్ణ, ఈసీ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మమత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి